ఎక్సయిజ్ శాఖలో 53 అధికారులకు పదోన్నతులు

Excise Minister Jupalli Krishna Rao announced promotions for 53 officers, emphasizing transparency and strict action against illegal liquor.

తెలంగాణ ఎక్సయిజ్ శాఖలో ఏఈఎస్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు 53 మంది అధికారులకు పదోన్నతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసారు.

మంత్రికి కలిసిన ప్రతినిధులు – అడిషనల్ కమిషనర్లు ఎస్‌.వై. ఖురేషి, సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్లు జె. హరికిషన్, చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్లు డి. శ్రీనివాస్, ప్రదీప్‌రావు, జ్యోతికిరణ్, పంచాక్షరి, ఆర్.కిషన్, ఈఎస్‌లు ఏ.కిషన్, తుక్యా నాయక్, జీవన్ కిరణ్ తదితరులు – తమ కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు పదోన్నతులు పొందిన అధికారులు మరింత ఉత్సాహంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అంతేకాకుండా కల్తీ, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిఘా వ్యవస్థను బలోపేతం చేసి గంజాయి, కల్తీ కళ్ళు తయారీ, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.

అంతేకాక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులకు తగు శిక్ష పడేలా చూడాలని, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉంటుందని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share