పత్తి కొనుగోలు వ్యాపారంలో రైతులు నష్టపోతున్నారు

Farmers incur losses in cotton purchase, while middlemen make huge profits.

రైతులు ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే, విత్తనాలు నాటడం, మందులు చల్లడం, కలుపు తీయించడం, పత్తి ఎరడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇలా అన్ని భరిస్తున్నా, లాభం దొరకడం కష్టమే. అయితే, దళారులు మాత్రం మంచి లాభాలు పొందుతున్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లో పత్తి నమోదు చేసిన రైతుల పాసుబుక్కులను ఒక దగ్గర చేర్చి, వ్యాపారం కొనసాగిస్తున్నారు. పాస్ బుక్ ఇచ్చిన రైతు ఒక్కో క్వింటాల్ కు సుమారు 400–500 రూపాయలు మాత్రమే పొందుతుంటే, వ్యాపారి సీసీఐ రేటుకు మించిన డబ్బులు తీస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.

మహారాష్ట్ర పత్తి కోసం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే పత్తి కోసం, పాస్ బుక్ లేని వ్యాపారులు స్థానిక పాస్ బుక్కులు కలిగిన రైతులను ఉపయోగిస్తున్నారు. వ్యాపారులు కొంత డబ్బు ఇచ్చి, మహారాష్ట్ర పత్తిని కూడా స్థానిక పాస్ బుక్కుల ద్వారా అమ్ముతున్నారు. దీని ద్వారా రైతులు తగిన రాబడి పొందలేకపోతున్నారు.

కేవలం పంట పండించిన రైతులకే కాదు, పంట పండించని, భూమి కలిగినవారికి కూడా డిమాండ్ ఉంది. పంట పండించని రైతు, కౌలు ఇచ్చే వ్యవస్థలో పాల్గొని డబ్బులు పొందిన తర్వాత, ఇప్పుడు దళారులు అలాంటి పాస్ బుక్కులను కొని పంట కొనుగోళ్లు చేస్తున్నారు.

ఇలాంటి వ్యవహారాలు రైతుల నష్టాన్ని పెంచుతూ, వ్యవసాయ మార్కెట్‌లో అక్రమ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. రైతుల శ్రమ, పెట్టుబడికి సరైన రాబడి వచ్చేలా అధికారుల ద్వారా నియంత్రణలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు మరియు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share